Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్ గ్యాస్ లీక్.. మానవ తప్పిదమే కారణం: ఫోరెన్సిక్

Advertiesment
Vizag
, సోమవారం, 11 మే 2020 (21:35 IST)
విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ కి మానవ తప్పిదమే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. లాక్ డౌన్ సందర్భంగా మెయిన్ టెనెన్స్ లో నిర్లక్ష్యం, మానవతప్పిదాల ఫలితంగానే స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్టు ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం తెలిపింది.

డాక్టర్ సరీన్, టి.సురేష్ నేతృత్వంలో ఈ సంస్థకు చెందిన టీమ్ ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి సాక్ష్యాధారాలు సేకరించింది. స్టెరీన్ స్టోరేజీ ట్యాంక్ లోపల ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్ని మిక్స్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అలాగే 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చూడడంలో అలసత్వం వహించారని ఈ బృందం తమ నివేదికలో పేర్కొంది.

సెల్ఫ్ పాలిమరైజేషన్ ని నివారించేందుకు స్టెరీన్ గ్యాస్ ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్లో కలపాల్సి ఉందని, కానీ లాక్ డౌన్ కాలంలో ఇలా జరగలేదని వివరించారు. సెల్ఫ్ పాలిమరైజేషన్ క్రమంగా మొదలై.. కెమికల్ రియాక్షన్ కి దారి తీసింది..దీంతో 150 డిగ్రీల సెంటీగ్రేడ్ తో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడింది అని ఈ నివేదిక తెలిపింది.

దీనిని వెరిఫై చేయడానికి కంట్రోల్ రూమ్ లో ఒక ఆపరేటర్ ఉండాలని, తాము సైట్ ని పరిశీలించిన రోజున స్టోరేజీ ట్యాంక్ లో టెంపరేచర్ 120 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్  ఉన్నట్టు ఈ బృందం పేర్కొంది. కూలింగ్ ప్రాసెస్ ని కూడా సరిగా నిర్వహించలేదని డాక్టర్ సరీన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలు నమ్మకండి: మంత్రి పేర్ని నాని