Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బై బై ఏపీ అంటున్నాయి: లోకేష్

Advertiesment
Nara lokesh
, శనివారం, 23 నవంబరు 2019 (11:41 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్ళలు గుప్పించారు. ‘‘జగన్ గారిని చూసి రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బై బై ఏపీ అంటున్నాయి.

చేసేది ఏమీ లేక చంద్రబాబుగారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు మేము తెచ్చాం అని జగన్ గారు బిల్డప్ ఇస్తున్నారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జగన్ గారికి ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయి అనుకోవడం అత్యాశే అవుతుంది. 
 
వీర వాహన సంస్థని రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబుగారు పడిన కష్టం అందరికీ తెలుసు. రాయితీలు ఇచ్చి, భూ కేటాయింపులు చేసి తెచ్చిన కంపెనీకి ఇప్పుడు జగన్ గారు వైసీపీ రంగు పూయాలని తెగ తాపత్రయపడుతున్నారు. 
 
వేరే వారికి పుట్టిన బిడ్డకి మీరు తండ్రి అని చెప్పుకోవడం మాని, సొంతంగా ఏదైనా సాధించి డప్పు కొట్టుకోండి హైలీ రెస్పెక్టెడ్ జగన్ గారు’’ అంటూ లోకేష్ విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీలో కలవరం రేపుతున్న సుజనాచౌదరి వ్యాఖ్యలు