Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యం ప‌ట్టివేత‌.. 8 మంది నిందితులు అరెస్టు

Advertiesment
Illicit liquor
, గురువారం, 21 మే 2020 (05:51 IST)
విజ‌‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఎనికేపాడు 100 అడుగుల‌ రోడ్డులో దొడ్డిదారిన అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న 8 మంది‌ని స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల వ‌ద్ద నుంచి 352 మ‌ద్యం బాటిల్స్‌, 1 కారు, 5 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను సీజ్ చేశారు. నగర పోలీస్ కమీషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్ర‌త్యేక అధికారి ఎం.స‌త్తిబాబు ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందం బుధ‌వారం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి త‌నిఖీలు చేస్తున్న సంద‌ర్భంలో భారీగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న నిందితులు ప‌ట్టుబ‌డ్డారు‌.

తనిఖీల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ హనీష్, ఎస్.ఐ.లు జి.శ్రీనివాస్, ర‌మేష్, భరత్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంబులెన్స్ డ్రైవర్ తాళాలు లాక్కున్నారు, ఒక ప్రాణాన్ని తీసేశారు, ఎక్కడ?