Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెన

అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం
, బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:33 IST)
అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెనాలిలోని చెంచుపేటకు తరలించారు. 
 
అమెరికాలోని సిన్సినాటి ధర్డ్ ఫిప్త్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పృధ్విరాజ్ ఈ నెల 6న బ్యాంకులో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా... విజయనగరం జిల్లాలో 14 అడుగుల కింగ్ కోబ్రా(ఫోటోలు)