Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీఎస్ ఆర్టీసీలో 15 నుంచి బుకింగ్

ఏపీఎస్ ఆర్టీసీలో 15 నుంచి బుకింగ్
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:08 IST)
ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.

ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టేస్తుందని అధికార వర్గాల సమాచారం. 
 
వివరాల్లోకెళితే.. ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 
 
ఏసీ బస్సుల బుకింగ్స్‌ను మాత్రం నిలిపివేసింది. అది కూడా విజయవాడ బస్టాండ్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే ప్రారంభించింది. 115 సర్వీసులకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఆర్టీసీ.. కరోనా ప్రభావం తగ్గితే దశల వారీగా బస్సుల బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

104, 1902 కాల్ సెంటర్లతో లాక్‌డౌన్ కష్టాలకు పరిష్కారం