Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోము వీర్రాజు లిక్కర్ స్కీమ్.. కేటీఆర్ సెటైర్లు.. వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం..?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:56 IST)
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లకు దారితీశాయి. ఏపీలో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖులు సెటైర్లు వేస్తున్నారు.
 
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. అలాగే  సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేశారు. 'వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?' అని ఎద్దేవా చేశారు.  
 
కాగా, దేశంలోని ఎన్డీయేత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు నేత‌లు కూడా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై చుర‌క‌లు అంటిస్తున్నారు. ఇంత గొప్ప ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బీజేపీకి భ‌విష్య‌త్తులో ఇంకా ఎన్ని మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయో అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments