Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

vithika varun

వరుణ్

, సోమవారం, 17 జూన్ 2024 (14:35 IST)
సినిమాలు ఇక వద్దు అని చిత్రపరిశ్రమను వీడి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూర్ నటులు అంటారని హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక అన్నారు. కానీ, తన భర్త 17 యేళ్లుగా చిత్రపరిశ్రమను నమ్ముకుని ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. 
 
వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'నింద'. యథార్థ సంఘటనల ఆధారంగా రాజేశ్‌ జగన్నాథం దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. జూన్‌ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక భావేద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత వరుణ్‌ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. 'నింద' ప్రమోషన్స్‌లో ఆయన్ని చాలామంది తన కెరీర్‌ ఫెయిల్యూర్‌పై ప్రశ్నలు అడుగుతున్నారు. 'మీకు అవకాశాలు రావడం లేదు కదా.. మీరు ఫెయిల్డ్‌ యాక్టర్‌ కదా' ఇలా ప్రశ్నిస్తున్నారు. 
 
నిజం చెప్పాలంటే వరుణ్‌ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్‌ యాక్టర్‌ అంటారు. వరుణ్‌ అలా చేయలేదు. ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిత్రానికి 100 శాతం న్యాయం చేస్తాడు. 'నింద' మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని వితిక ఆకాంక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !