Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్-శంకర్ సినిమాలో రష్మిక.. జర్నలిస్టుగా..?

Advertiesment
Rashmika Mandanna
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:54 IST)
టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రంలో నటిస్తున్న రష్మిక.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బాయ్' అనే సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్-శంకర్ సినిమాలో హీరోయిన్ రష్మిక ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె జర్నలిస్టు‌గా కనిపించనుందట. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. చరణ్‌కు మీడియా సపోర్టర్ గా రష్మిక పాత్ర కీలకంగా ఉండనుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అది అలా ఉంటే తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. 
 
ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ఆమె వెల్లడించారు. "ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను. త్వరలోనే మూడో సినిమా అంగీకరించబోతున్నాను." అని రష్మిక తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్య... చేతి నరాలు కట్ చేసుకుని..?