Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

Advertiesment
rashi khanna

ఠాగూర్

, మంగళవారం, 22 జులై 2025 (13:05 IST)
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ పవన్ సరసన్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు. అయితే, ఈ యాక్షన్ ఫ్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో తాజాగ రాశీఖన్నా జాయిన్ అయినట్టు మేకర్స్ ధృవీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఆమె షూటింగులో జాయిన్ అయినట్టు ఒక పోస్టు పెట్టారు. ఇందులో ఆమె శ్లోక అనే పాత్రలో నటిస్తున్నారని ఆెకు స్వాగతం అంటూ పోస్టు పెట్టారు. 
 
కథాంశానికి కొత్తదనాన్ని తెచ్చే బలమైన కీలకమైన పాత్ర మేకర్స్ పేర్కొన్నారు. ఈ మూవీలో రాశీఖన్నా శ్లోక అనే పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది సమాచారం. హీరో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనా నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో ప్రతిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాశ్, గౌతమి, నాగ మహేశ్ నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం