Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొన్ని అరుదైన ఫొటోలను ఫోను కెమెరాలో బంధించాను : రేణూ దేశాయ్

Advertiesment
Pawan Kalyan
, బుధవారం, 2 డిశెంబరు 2020 (17:19 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో కింద.. కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేయాల్సిన అవసరం ఉంది అనే క్యాప్షన్ పెట్టారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రేణూ దేశాయ్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. పిమ్మట జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి దూరమైన తర్వాత మరాఠి సినిమాల్లో ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. 
 
అయితే, పిల్లలిద్దరినీ తన వద్దనే ఉంచుకుని ఒక తల్లిగా ఆమె వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తనకు వీలు ఉన్నప్పుడల్లా పూణెకు వెళ్లి తన పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు.
 
ఈ క్రమంలో రేణు దేశాయ్ తాజాగా ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు. 
 
కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వకీల్ సాబ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్... స్లిమ్‌గా కనిపించాలని లిక్విడ్ డైట్..?