Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

rajamouli - mahesh

ఠాగూర్

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:34 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో యాక్షన్ అడ్వెంచర్ తరహాలో జానర్‌లో తెరకెక్కే చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గెటప్, లుక్‌ కోసం మహేశ్ మేకోవర్‌లో ఉండగా, ద్రశకుడు మాత్రం స్క్రిప్టుపై కసరత్తులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో జనవరిలో ప్రారంభంకానున్న ఈ చిత్రం గురించి మరో వార్త వినిపిస్తోంది. మహేశ్ - రాజమౌళి సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో కొనసాగే ఈ కథను ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే విధంగా లేదని రాజమౌళి అండ్ ఆయన బృందం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న ఈ చిత్రం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర యూనిట్ ముందే నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో ఇండియన్ ఆర్టిస్టులతో పాటు విదేశీ నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇండియానా జోన్స్ మాదిరిగా ఈ చిత్రం సీక్వెల్‌కు ఒకదాని తర్వాత మరొకటి వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు. 
 
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న విషయం తెల్సిందే. నిర్మాత కేఎల్ నారాయణ తన సొంత బ్యానర్ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా రూపొందించి విడుదల చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)