Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు అగ్రజుల చిత్రాలు వస్తున్నాయ్.. ఘనంగా స్వాగతిద్ధాం... క్రిష్‌ ట్వీట్

తెలుగు చిత్ర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఇద్దరు అగ్రనటుల చిత్రాలు ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నాయి. ఆ ఇద్దరిని స్వాగతిద్ధాం అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ ట్వీట్ చేశ

Advertiesment
Krish's Tweet
, బుధవారం, 4 జనవరి 2017 (13:33 IST)
తెలుగు చిత్ర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ఇద్దరు అగ్రనటుల చిత్రాలు ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తున్నాయి. ఆ ఇద్దరిని స్వాగతిద్ధాం అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ట్వీట్‌తో ఈ చిత్రాల మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాడు.
 
సంక్రాంతికి విడుదల కానున్న 'ఖైదీ నెంబర్‌ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాల మధ్య ఎంత యుద్ధం జరగాలో, అంతా జరుగుతోంది. విడుదల తేదీల విషయంలోనూ, ‘ఖైదీ’ ఈవెంట్‌కు వేదిక దొరక్కపోవడం విషయంలోనూ చాలా రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ తన ట్వీట్‌తో వివాదాలను తగ్గించే ప్రయత్నం చేశాడు. 
 
‘ఈ సంక్రాంతికి తమ ప్రతిష్టాత్మక సినిమాలతో వినోదం అందించడానికి ఇద్దరు లెజెండ్స్‌ వస్తున్నారు. వారికి స్వాగతం పలుకుదాం’ అని రెండు సినిమాలను విడుదల తేదీలతో సహా ట్వీట్‌ చేశాడు. ముఖ్యంగా 11నే ‘ఖైదీ’ వస్తుందని తేలడంతో తమ సినిమా కూడా అదే రోజు రావాలని బాలయ్య ఫ్యాన్స్‌ ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎలాంటి అనుమానాలకూ తావివ్వకుండా ‘శాతకర్ణి’ 12నే వస్తుందని పునరుద్ఘాటించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికతో చేతులు కలపనున్న బిచ్చగాడు.. ఫిబ్రవరి నుంచి షూటింగ్..