Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''జబర్దస్త్'' యాంకర్ రష్మీ గౌతమ్‌ స్టెరాయిడ్స్ తీసుకుందట..

Advertiesment
Rashmi Gautam
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (12:32 IST)
''జబర్దస్త్'' యాంకర్ రష్మీ గౌతమ్‌ ఆటో ఇమ్యూన్ సమస్యలతో స్టెరాయిడ్స్ వాడినట్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరపై వెండితెరపై తన అందచందాలను ఆరబోస్తూ.. యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు రుమటాయిడ్ వుందనే సంగతి తెలిసిందే. తాను ట్రీట్మెంట్ తీసుకున్నానని రష్మీ చెప్పింది. దీంతో ఆమెను పరామర్శించే రీతిలో నెట్టింట కామెంట్లు వచ్చాయి. 
 
తను టీట్మెంట్ తీసుకున్నానని రష్మీ చెప్పడం.. చాలామందిని ఆలోచనలో పడేసింది. తాజాగా శిరీష అనే యువతి రష్మికి ట్వీట్ చేస్తూ ''రుమటాయిడ్‌ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందో లేదో తెలియదు కానీ... నా భర్త నాలుగేళ్లుగా రుమటాయిడ్స్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో తెలీడం లేదు. ఒకప్పుడు మీరూ రుమటాయిడ్‌తో బాధపడిన వారే కదా.. మీరేదన్నా ఐడియా ఇవ్వగలరా? అని అడిగింది.
 
వెంటనే  రష్మి స్పందిస్తూ.. ఇందుకు ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ లేదని.. మన లైఫ్ స్టైయిల్‌లో కొన్ని మార్పులు చేసుకోవడంతోనే సరిపెట్టుకోవాల్సి వుంటుందని చెప్పింది. అంతేగాకుండా, ఆయుర్వేద మందులు వాడితే మంచి ఫలితం వుంటుందని తెలిపింది. ఇటీవల తనకు ఆటో ఇమ్యూన్‌ సమస్యలు ఎదురైనప్పుడు స్టెరాయిడ్లు తీసుకున్నానని చెప్పింది. 
 
చిన్నప్పటి నుంచే రుమటాయిడ్స్ నుంచి ఉపశమనం కోసం బాగా నొప్పి కలిగించే స్టెరాయిడ్స్ తీసుకున్నా. ఆ తర్వాత అమ్మ చెప్పిన చిట్కాలను పాటిస్తున్నా. ఆహారం, వ్యాయామమే ఇందుకు మంచి ఔషధం అని చెప్పింది. ఇంకా ఒత్తిడిని దూరం చేసుకోవాల్సి వుంటుందని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవా బ్యూటీ ఇలియానా గర్భందాల్చిందా...