Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏ మాయ చేసావె సీక్వెల్‌లో ''మాధవన్''.. ఆ కాంబో మళ్లీ రిపీట్..?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్

Advertiesment
Gautham Vasudev Menon
, బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:34 IST)
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్యింది. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమా యూత్ మధ్య మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ మూవీ సీక్వెల్‌లో మాధవన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని మాధవనే స్వయంగా ప్రకటించాడు.  అలాగే టివినో థామస్, పునీత్ రాజ్‌కుమార్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 
 
ఇకపోతే, గౌతమ్‌తో మాధవన్ 2001లో మిన్నలె(తెలుగులో చెలి) చిత్రానికి గానూ కలిసి పనిచేశారు. మళ్లీ గౌతమ్ మీనన్, మాధవన్ కాంబినేషన్ దాదాపు 17 సంవత్సరాల రిపీట్ అవుతోంది. మరి ఈ సినిమా తెలుగు సీక్వెల్‌ కోసం గౌతమ్ మీనన్ చైతూనే తీసుకుంటాడా? లేకుంటే వేరొక హీరోను ఎంచుకుంటాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేయింబవుళ్లు చెమటోడ్చుతున్న హీరోయిన్...