Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరోయిన్ రేటు రూ.5 కోట్లు...

టాలీవుడ్‌కు 'లోఫర్' చిత్రం ద్వారా పరిచయమైన భామ దిశా పటానీ. తక్కువ సమయంలో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయవిహారం చేస్తోంది. అందుకేనేమో ఓ భారీ కోలీవుడ్ చిత్రానికి

Advertiesment
Disha Patani
, సోమవారం, 2 జులై 2018 (10:56 IST)
టాలీవుడ్‌కు 'లోఫర్' చిత్రం ద్వారా పరిచయమైన భామ దిశా పటానీ. తక్కువ సమయంలో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయవిహారం చేస్తోంది. అందుకేనేమో ఓ భారీ కోలీవుడ్ చిత్రానికి గాను ఆమె గట్టిగానే పారితోషికాన్ని డిమాండ్ చేస్తునట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
'లోఫర్' చిత్రం తర్వాత 'యమ్.యస్.ధోనీ', 'కుంగ్ఫూ యోగా', 'వెల్కమ్ టు న్యూయార్క్' వంటి చిత్రాల్లో నటించింది. తన ట్రేడ్ మార్క్ అందచందాల్ని ప్రదర్శించి అక్కడ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా 'బాఘీ-2'తో ఈ చిన్నది బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్ జనాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. 
 
సి.సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీ 'సంఘమిత్ర'లో దిశా హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య వంటి హీరోలు నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆమెతో అభిప్రాయభేదాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ దిశా పటానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 
 
అయితే ఇదే అదునుగా భావించిన దిశా పటానీ... అంత తేలిగ్గా ఒప్పుకోలేదట. దానికోసం ఆమె రూ.3 కోట్ల వరకూ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. నిర్మాతలూ దానికి అంగీకరించారు. అయితే మొన్నటివరకు బాగానే ఉన్న అమ్మడు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని డేట్స్ క్లాష్ అవుతాయనే వంకతో ఇంకో రెండు కోట్లు పెంచేసిందట. అంటే.. ఈ ఒక్క ప్రాజెక్టుకు ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తోందట. దీంతో చిత్ర యూనిట్ కూడా ఏమి అనలేని పరిస్థితి. దిశానా మాజాకా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి కాలేదని బాధ లేదు.. ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నా: టబు