Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బప్పిలహరి' గొంతు మూగబోయిందా? క్లారిటీ ఇచ్చిన సింగర్

Advertiesment
BappiLahiri
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:37 IST)
ప్రముఖ బాలీవుడ్ సింగర్ బప్పిలహరి కరోనా వైరస్ బారినపడిన తర్వాత ఆయన గొంతు మూగబోయిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా జరిగింది. ఈ వార్త భారతీయ చిత్రపరిశ్రమలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై ఈ సింగర్ క్లారిటీ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వివరణ ఇచ్చారు. 
 
నిజానికి సోషల్ మీడియాలో అనేక రకాలైన తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రాణంతోవున్నవారిని చంపేయడం, ఆరోగ్యంతో ఉన్నవారిని అనారోగ్యం బారిన పడేయడం సర్వసాధారణంగా మారిపోయింది. 
 
అలాంటి పరిస్థితే బప్పిలహరి విషయంలోనూ జరిగింది. బప్పిలహరికి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన త్వరగానే కోలుకున్నారు. అయితే కరోనా సోకడం మూలాన అతని గొంతు పోగొట్టుకున్నారని పలు వార్తలు వైరల్ కాగా వాటి అన్నిటికీ బప్పిలహరి తన గొంతుతోనే సమాధానం ఇచ్చారు. 
 
తన గొంతుతోనే పాట పాడి ఆ వీడియోని షేర్ చేసి తాను బాగానే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకి బ్రేక్ పడింది. బప్పిలహరి కెరీర్‌లో ఎన్నో హిస్టారికల్ హిట్ నంబర్స్ కూడా ఉన్నాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’  పాట దేశం మొత్తాన్ని షేక్ చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాయి శేఖర్ రిటర్న్స్: వడివేలు సరసన మహానటి?