Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంతతో నా ఫ్యామిలీ గడిపిన ప్రతిక్షణం ఎంతో మధురమైనది.. నాగార్జున

Advertiesment
Naga Chaitanya
, ఆదివారం, 3 అక్టోబరు 2021 (11:04 IST)
టాలీవుడ్ దంపతులు అక్కినేని నాగ చైతన్య, సమంతలు వీడిపోవడంపై స్టార్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. వీరిద్దరూ విడిపోవడం దురదృష్టకరమన్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాల్ ఓ పోస్ట్ చేశారు.
 
"చైతూ - సమంత విడిపోవడం దురదృష్టకరం. భార్యభర్తలు విడిపోవడం వారి వ్యక్తిగత విషయం' అంటూ పేర్కొన్నారు. సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున చెప్పుకొచ్చారు.
 
‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతు-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. 
 
సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. 
 
కాగా, చైతన్య-సమంత తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు చైతన్య. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలను బట్టల్లా మార్చే వ్యక్తులపై దయ చూపొద్దు : కంగనా రనౌత్