Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

Trisha

సెల్వి

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (13:46 IST)
కొన్నేళ్ల క్రితం మోహిని, నాయకి వంటి పేలవమైన ఆదరణ పొందిన చిత్రాలతో త్రిష కెరీర్ అంతేనని అందరూ అనుకుంటారు. కానీ ఆపై 96 సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తన అందాన్ని మెరుగుపరుచుకుని కోలీవుడ్ లో రూ.200 కోట్ల సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో రాజకుమారిగా అదరగొట్టిన త్రిష.. లియో, గోట్ చిత్రాల ద్వారా తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 
 
తమిళనాడులోని మొత్తం 200 కోట్ల గ్రాసర్‌లలో త్రిష కనిపించింది. విజయ్, త్రిష నటించి.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో (2023) తమిళనాడులో దాదాపు 230 కోట్లు వసూలు చేసిన అగ్ర తమిళ చిత్రంగా నిలిచింది. 
 
విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ నటించిన పొన్నియిన్ సెల్వన్... రూ. 1, 220 కోట్లతో తమిళంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. తలపతి విజయ్ తాజా చిత్రం, ది గోట్, తమిళనాడులో 210 కోట్లను వసూలు చేసి 200 కోట్ల క్లబ్‌లో సరికొత్తగా చేరింది. 
 
ఈ చిత్రంలో, త్రిష "మట్టా" అనే ప్రత్యేక పాటలో కనిపించింది. ఇది చాలా కాలం తర్వాత మాస్ సాంగ్ గా నిలిచింది. ఇంకా ఐటమ్ సాంగులో ఆమె కనిపించడం ఆమె ఫ్యాన్సును సంబరంలో ముంచెత్తింది. 
 
ఇకపోతే.. త్రిష విడా ముయర్చి, గుడ్, బ్యాడ్, అగ్లీ అనే సినిమాల్లో నటించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు