Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన 'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేప

Advertiesment
Charmy Kaur
, గురువారం, 13 జులై 2017 (17:32 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన  'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తో కలిసి బాలకృష్ణ చేస్తున్న ‘పైసా వసూల్‌’ సినిమా కోసం ఛార్మీ రూ.4కోట్ల మేర పారితోషికం తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. 
 
అయితే ఛార్మీ మాత్రం తాను రూ.4కోట్లు పుచ్చుకున్నట్లు వచ్చిన వార్తలపై ఫైర్ అయ్యింది. పైసా వసూల్ సినిమా నిర్మాణమే రూ.25 కోట్ల రూపాయల్లో జరిగితే, తనకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇచ్చారని ఛార్మీ మండిపడుతోంది. కాగా బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత పూరీతో పైసా వసూల్‌ మూవీలో నటిస్తున్నారు. ఇందులో శ్రేయ హీరోయిన్‌గా.. ఛార్మీ స్పెషల్ రోల్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళాభవన్ మణి హత్యలోనూ దిలీప్‌‌కు లింక్?: మమ్ముట్టి ''సిస్టర్'' అంటే కమల్ ''భావన'' అన్నారు..