Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17న గుండెంగి గ్రామంలో వైఎస్. షర్మిళ ఉద్యోగ దీక్ష

17న గుండెంగి గ్రామంలో వైఎస్. షర్మిళ ఉద్యోగ దీక్ష
, సోమవారం, 16 ఆగస్టు 2021 (19:55 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ప్రతి మంగళవారం ఒక రోజు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు గ్రామాల్లో ఆమె దీక్ష చేశారు. ఈ దీక్షలో భాగంగా, ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఓదార్చుతున్నారు. 
 
ఇదిలావుంటే, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మహబూబాబాద్ జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఉద్యోగ దీక్ష చేయనున్నారు. అనంతరం మంగళవారం రాత్రి వరంగల్ పట్టణంలోనే షర్మిల బస చేస్తారు. ఉద్యోగ దీక్షతో పాటు పోడు భూముల పోరుకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు.
 
మరోవైపు ఎల్లుండి (బుధవారం) ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ షర్మిల.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతున్న వైఎస్ షర్మిల గత మంగళ వారం హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉద్యోగ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత ఆర్థిక సాయం..