Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిక్ మై ప్లాస్టిక్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిద్స్ ఫార్మ్

plastic ban
, మంగళవారం, 20 జూన్ 2023 (21:02 IST)
తెలంగాణకు చెందిన ప్రీమియం డైరెక్ట్-టు-కన్స్యూమర్ డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్, "పిక్ మై ప్లాస్టిక్" పేరిట కొత్త పర్యావరణ అనుకూల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. పర్యావరణ బాధ్యత, ఉత్పత్తి నాణ్యతను నిర్వహించడం పట్ల పూర్తి నిబద్ధతతో, సిద్స్ ఫార్మ్ తమ వినియోగదారుల ఇళ్ల నుండి ప్యాకేజింగ్ పదార్థాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్ చేయడం మరియు ఉత్తమ పరిశ్రమ పద్ధతుల ప్రకారం ప్రాసెస్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
పెరుగు, నెయ్యి, లస్సీ, మజ్జిగ మొదలైన వాటితో సహా సిద్స్ ఫార్మ్ యొక్క విస్తృత శ్రేణి పాలు, పాల ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేయడానికి ప్లాస్టిక్ పౌచ్‌లు వినియోగిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సమస్య పరిష్కరించడం, కార్బన్-న్యూట్రల్ భవిష్యత్తు దిశగా కృషి చేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ, సిద్స్ ఫార్మ్ ఇప్పుడు స్వచ్ఛమైన హరిత వాతావరణానికి చురుకుగా సహకరించడానికి "పిక్ మై ప్లాస్టిక్" కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ, "'పిక్ మై ప్లాస్టిక్' కార్యక్రమాన్ని పరిచయం చేయడం ఆనందంగా ఉంది, ఇది సుస్థిరత మరియు పర్యావరణ నేతృత్వం పట్ల మా లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం, మా ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడానికి అనుమతిస్తుంది. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా మా వినియోగదారులను  ప్రోత్సహించడం ద్వారా, అత్యధిక నాణ్యత గల పాలు మరియు పాల ఉత్పత్తులను డెలివరీ చేస్తూనే స్థిరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు 
 
"పిక్ మై ప్లాస్టిక్" కార్యక్రమంలో భాగంగా, కస్టమర్‌ల నుండి ఒక్కో పికప్‌కు రూ.12 నామమాత్రపు రుసుమును వసూలు చేస్తారు, ఇది వారి యాప్‌లో ప్రీపెయిడ్ వాలెట్ నుండి వసూలు చేయబడుతుంది. ఈ సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు, కస్టమర్‌లు ప్లాస్టిక్ పౌచ్‌లను శుభ్రంగా ఉంచుకోవాలి, డెలివరీ సిబ్బంది వాటిని అంగీకరించడానికి ఒకదానితో ఒకటి బండిల్ చేయాలి. యాంటీబయాటిక్స్, సింథటిక్ హార్మోన్లు, కల్తీ లేకుండా ఉత్పత్తులను పంపిణీ చేయడంపై దృష్టి సారించడంతో, సిద్స్ ఫార్మ్ స్థిరమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దాని సబ్‌స్క్రిప్షన్-ఆధారిత మోడల్ ద్వారా ప్రతిరోజూ 20,000 మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోరమాండల్ రైలు ప్రమాదం : సీబీఐ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్