Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సికింద్రాబాద్‌లో ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు...

bonalu talasani
, ఆదివారం, 9 జులై 2023 (11:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు అట్టహాసంగా మొదలయ్యాయి. అమ్మవారికి తొలి పూజల అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఇదిలావుంటే, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. దీంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం 9.30 గంటలకు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆరు వరుసలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి తొక్కిసలాట లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 
 
బోనాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రత్యేకంగా 150 సిటీ బలను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను ఆదివారం, సోమవారాల్లో ప్రత్నామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఈ బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొన్న మూత్రం పోశారు.. ఇపుడు పాదాలు నాకించారు.. ఎంపీలో అమానవీయ ఘటనలు