Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2020లో తెలంగాణ రైతు ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

Rahul Gandhi
, బుధవారం, 1 నవంబరు 2023 (22:14 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు 2020లో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ రైతు దివంగత కుమ్మరి చంద్రయ్య ఇంటిని సందర్శించారు. రైతు కుటుంబాన్ని పరామర్శించారు. భారతదేశంలోని రైతులు నిజమైన ‘తపస్వి’ అని, వారి కష్టానికి ప్రతిఫలం లభించకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి రైతులను, కుటుంబాలను ఆదుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్ ‘రైతు భరోసా’ హామీని రూపొందించామని రాహుల్ గాంధీ అన్నారు.

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రంలో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, "కుమ్మరి తిరుపతమ్మ కళ్లలో, నేను భయంకరమైన గతం బాధను, ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశను చూశాను. భారతదేశ రైతులు మా భూమికి దక్కిన నిజమైన 'తపస్వి' మూర్తులు. వారు ఎటువంటి ప్రతిఫలం పొందలేకపోవడం చూడటం హృదయ విదారకంగా ఉంది." అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు