Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

మణికొండలో గోతిలో పడి చనిపోయిన వ్యక్తి గుర్తింపు...

Advertiesment
Hyderabad
, ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:36 IST)
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమలో మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. 
 
ఆ వ్యక్తిని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అతని పేరు గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అత‌డి ఇల్లు ఘ‌ట‌నాస్థ‌లికి 50 మీట‌ర్ల దూరంలోనే ఉంది. అత‌డు షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నాడు.
 
శనివారం రాత్రి 9 గంట‌ల‌కు ఇంటిని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంత‌ను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో ప‌డ్డాడు. అత‌డి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంట‌లుగా గాలిస్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం నాలాలు క‌లిసే ప్రాంతంలో ర‌జనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వ‌ద్ద కూడా మ‌రో బృందం గాలిస్తోంది. కాగా శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో హైద‌రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట‌ మునిగిన విష‌యం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత విమాన రాకపోకలపై నిషేధం ఎత్తివేత