Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నారిపై 22 ఇంచుల టీవీ పడింది... అంతే మృతి

చిన్నారిపై 22 ఇంచుల టీవీ పడింది... అంతే మృతి
, గురువారం, 19 మే 2022 (13:21 IST)
ఆడుకుంటూ వుండిన చిన్నారిపై టీవీ పడటంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ ఫస్ట్‌ ల్యాన్సర్‌కు చెందిన ఎండీ లయీజుద్దీన్‌ కార్పెంటర్‌. అతడి కుమార్తె మెహ్రాజ్‌ ఫాతిమా (2) ఆడుకుంటోంది. ఆమె అల్లరి పనులను తల్లిదండ్రులు సంబరంగా చూస్తున్నారు. 
 
తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లిన ఫాతిమా టీవీ స్టాండ్‌కు తగిలింది. దీంతో దాని మీద ఉన్న 22 ఇంచుల టీవీ ఆమెపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి స్పృహ తప్పింది. వెంటనే తల్లిదండ్రులు విజయ్‌నగర్‌కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అనంతరం బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 11 కోట్ల ఆస్తిని మత సంస్థలకు విరాళమిచ్చి భార్యాబిడ్డలతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడు