Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి.. ఇంట్లో వదిలి కూలీకి వెళ్తే...

dogs

సెల్వి

, మంగళవారం, 14 మే 2024 (17:21 IST)
వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతులు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తమ బిడ్డ సాయితో కలిసి నివసిస్తున్నారు. 
 
రోజూలాగే మంగళవారం కూడా దంపతులు తమ ఐదు నెలల కుమారుడిని ఇంట్లో వదిలి కూలి పనులకు వెళ్లారు. పనిలో మధ్య లావణ్య నీళ్లు తాగేందుకు ఇంటికి తిరిగి రాగా ఇంటి దగ్గర ఓ కుక్క సంచరించడం గమనించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా కుమారుడిపై కుక్క దాడి చేసి కనిపించింది. వెంటనే కుటుంబీకులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
కుక్క ఫ్యాక్టరీ యజమానులదని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే, ఫ్యాక్టరీ యజమానులు తమ వద్ద పెంపుడు కుక్క లేదని, వీధి కుక్క పిల్లవాడిపై దాడి చేసి వుండవచ్చునని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులకు సాయం చేసిన పోలీసులు.. వరిపంట తడిసిపోకుండా..?