Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ పాఠశాలల్లో డెంగ్యూ, చికున్‌గున్యా.. తగ్గిన అటెండెన్స్

schools

సెల్వి

, బుధవారం, 28 ఆగస్టు 2024 (10:06 IST)
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది. గత నెల రోజులుగా, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్ కేసుల పెరుగుదల కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 15 నుండి 25 శాతం వరకు తగ్గినట్లు నివేదికలో వెల్లడి అయ్యింది.
 
నగరంలోని పాఠశాలల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావట్లేదు.  గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా పారిశుధ్యం, తక్కువ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న ప్రదేశాలలో ఇది ఎక్కువగా ఉంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పెరుగుతున్నందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు అంటువ్యాధి సోకుతుందనే భయంతో పాఠశాలలకు పంపడానికి ఇష్టపడట్లేదు. 
 
సాధారణంగా పాఠశాలల్లో 85 శాతం హాజరు నమోదవుతుంది. అయితే, వైరల్ ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో హాజరు శాతం 20 శాతం పడిపోయింది. 
 
కొద్ది రోజుల క్రితం ఖమ్మంలోని ఒకే ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు చికున్‌గున్యా వచ్చిందని అని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా... ఏంటది?