Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా... ఏంటది?

Australia

ఠాగూర్

, బుధవారం, 28 ఆగస్టు 2024 (09:53 IST)
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా తేరుకోలేని షాకిచ్చింది. 2025 విదేశీ విద్యార్థులను సంఖ్యను ఏకంగా 2.7 లక్షలకు తగ్గించేసింది. ఉన్నత విద్య, వృత్తి విద్యా, ట్రైనింగ్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితంచేస్తూ ఆస్ట్రేలియా విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఇది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియా ఒకటిగా ఉంది. అలాంటి ఆస్ట్రేలియా పాలకులు 2025లో దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించింది. రికార్డు స్థాయిలో వలసలు కొనసాగుతున్న పర్యవసానంగా దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెల కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
పరిమితం చేయనున్న సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. 
 
ఈ పరిణామంపై ఆస్ట్రేలియా మైగ్రేషన్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ అథారిటీ సభ్యుడు సునీల్ జగ్గీ స్పందించారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని 2022లో ఆస్ట్రేలియా 5.10 లక్షలకు పరిమితం చేసిందని, ఈ సంఖ్యను 2023లో 3.75 లక్షలకు కుదించిందని ప్రస్తావించారు. వార్షిక ప్రణాళికల్లో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తాజాగా మరింత తగ్గించారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గింపు అంతర్జాతీయ విద్యార్థులు అందరికీ వర్తిస్తుందని, భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదని అన్నారు.
 
ఆస్ట్రేలియాలో చదువు కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ ప్రకటన ప్రభావం చూపుతుందని, పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతారని ఆయన అంచనా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతానం లేని దంపతులకు రూ.1.10 లక్షలకు బిడ్డను అమ్మేశారు.. చివరికి?