Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. శరీరం బుల్లెట్లతో నిండిపోయింది..

Advertiesment
Death

సెల్వి

, గురువారం, 6 మార్చి 2025 (13:19 IST)
తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి అమెరికాలో మరణించాడు. అతని శరీరం బుల్లెట్లతో నిండిపోయిందని అతని స్నేహితులు పేర్కొన్నారు. మరణించిన విద్యార్థిని జి. ప్రవీణ్‌గా గుర్తించారు. అతని మరణానికి దారితీసిన కారణాలు స్పష్టంగా తెలియవని అతని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఎంఎస్ చదువుతున్నాడు. బుధవారం అమెరికా అధికారులు అతని కుటుంబానికి సమాచారం అందించారు. ప్రవీణ్ శరీరం బుల్లెట్లతో కనిపించిందని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రవీణ్ కుటుంబీకులు తెలిపారు. ప్రవీణ్‌ను గుర్తు తెలియని దుండగులు ఒక దుకాణంలో కాల్చి చంపారని కొందరు అంటున్నారు.
 
బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్ తన తండ్రికి ఫోన్ చేశాడని, కానీ అతను నిద్రపోతున్నందున కాల్ లిఫ్ట్ చేయలేక పోయాడని ప్రవీణ్ బంధువు అరుణ్ చెప్పాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రవీణ్ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారని తెలిపారు.
 
ఆ కుటుంబం హైదరాబాద్ పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందినది. శవపరీక్ష తర్వాత మరణానికి కారణం తెలుస్తుందని అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
 హైదరాబాద్‌లో బిటెక్ చదివిన ప్రవీణ్, 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. అతను డిసెంబర్ 2024లో భారతదేశాన్ని సందర్శించి ఈ సంవత్సరం జనవరిలో అమెరికాకు బయలుదేరాడు. కుటుంబ సభ్యులు సహాయం కోసం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను సంప్రదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలిని పిచ్చకొట్టుడు కొడుతున్న భార్యను చూసి భర్త గోడ దూకి పరార్ (video)