Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు శుభవార్త - అర్జిత సేవల్లో భక్తులకు అనుమతి

Advertiesment
TTD
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)భక్తులకు మరో శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన అర్జిన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తుంది. అలాగే, స్వామి వారి దర్శనంతో పాటు వివిధ సేవల్లో భక్తులు కూడా పాల్గొనేలా అనుమతి ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పునరుద్ధరించిన అర్జిత సేవా కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. 
 
శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-03-2022 గురువారం రాశిఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం...