Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుద్రాభిషేకం మహిమ.. సోమవారం చేస్తే సర్వం శుభం

lord shiva

సెల్వి

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:19 IST)
శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితునితో రుద్రాష్టాధ్యాయిని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని ఆలయాల్లో చేయాలి. శివ లింగానికి గంధం, భస్మం మొదలైన వాటితో అలంకరించి శివునికి తిలకంతో అలంకరించాలి. 
 
పువ్వులు, బిల్వ పత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత శివునికి నైవేద్యాన్ని సమర్పించాలి. 
 
స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి.. హారతి ఇవ్వాలి. అనంతరం గంగాజలంతో స్నానం చేయించి ఆ నీటిని ప్రసాదం రూపంలో భక్తులపై చల్లుకోవాలి. మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజలలో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. 
 
రుద్రాభిషేకం శ్రావణ మాసంలోని సోమవారం రోజున లేదంటే భాద్రపద మాసంలో సోమవారం నిర్వహించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-09-2024 సోమవారం దినఫలితాలు : ఇతరులకు ధనసహాయం తగదు...