Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దైవానికి దగ్గర కావడానికి అలా చేయవలసిందేనా?

Advertiesment
Friday Spiritual talk
అంతఃచేతనలో పూర్తిగా పరమాత్మ స్వరూపం నిండిన తరువాత కూడా మహర్షులు, యోగులు, సిద్దులు మహనీయులైన మన పూర్వికులు స్వధర్మాచరణను విడిచి పెట్టలేదు. ఆధునిక కాలంలో ఈ ధర్మాచరణ పట్ల సరైన అవగాహన లేక, అలా అవగాహన కల్పించేవారు లేక పొందాల్సిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. 
 
నవవిధ భక్తులలో మొదటిది అర్చన. కొందరు పరమాత్మ గుణ గాన సంకీర్తనాన్ని ఎంచుకుని తరించారు. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్న ఆ మార్గాలన్నింటి లక్ష్యం పరమాత్మని చేరుకోవడమే. మనసులో కల్మషం నింపుకుని ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. మనసు నిర్మలంగా సర్వ భూత హితకారియై ఉన్నప్పుడు, నిరంతరం పరమాత్మలో లీనమై చరించేటప్పుడు ఏలాంటి పూజలు చేయకపోయినా ఫరవాలేదు. ఆ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. 
 
కానీ... అలా చేరుకున్నప్పటికీ స్వధర్మానుష్టానాన్ని విడిచిపెట్టుకోవడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. మీరు చేసే పూజలు, పునస్కారాలు మిమ్మల్ని ధర్మమార్గంలో పట్టి నిలిపి ఉంచుతాయి. ధార్మిక చింతనల వలన మీ మదిలో చెడు ఆలోచనలు రావు. ఆ నిష్ట చెదరకుండా ఎప్పటికి నిలచి ఉండడానికి ఆధ్యాత్మిక దివ్య సాధనలో మీరు మరింతగా పురోగమించడానికి పరిపూర్ణంగా పరమాత్మ సాక్షాత్కారం కలగడానికి ఆ పూజలు ఖచ్చితంగా దోహదపడతాయి. మనసు పరమాత్మలో పూర్తిగా లీనమై ఉన్నప్పుడు మాట కూడా మంత్రం అవుతుంది. దృష్టి ప్రాపంచిక విషయాలపై ఉన్నప్పుడు మంత్రం కూడా మాట లాగే వినపడుతుంది. ఈ రెండిటికి మధ్య భేదాన్ని గుర్తించగలిగే స్థాయి పరిణతి చాలా అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (07-06-2019) దినఫలాలు- సంఘంలో గౌరవ ప్రతిష్టలు...