Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలోని మేధావులను కాల్చిపారేయాలి : బీజేపీ ఎమ్మెల్యే

దేశంలోని మేధావులను కాల్చిపారెయ్యాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆ ఎమ్మెల్యే పేరు బసవన గౌడ్ పాటిల్ యత్నాల్. కర్ణాటక రాష్ట్రంలోని విజ‌య‌పుర నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా

Advertiesment
Karnataka
, శనివారం, 28 జులై 2018 (13:08 IST)
దేశంలోని మేధావులను కాల్చిపారెయ్యాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆ ఎమ్మెల్యే పేరు బసవన గౌడ్ పాటిల్ యత్నాల్. కర్ణాటక రాష్ట్రంలోని విజ‌య‌పుర నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.
 
కార్గిల్ దివ‌స్ సంద‌ర్భంగా విజ‌య‌పుర‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో ఆయ‌న మాట్లాడుతూ, తానేగ‌నుకు కేంద్ర హోం శాఖ మంత్రినై ఉంటే దేశంలోని మేధావుల‌ను కాల్చి చంప‌మ‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చేవాడిన‌ంటూ వ్యాఖ్యానించారు. ఉదార‌వాదులు, మేధావులు జాతి వ్య‌తిరేకుల‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. 
 
మన దేశంలో చాలా మంది మేధావులు ఉన్నారనీ, వీరంతా మనం చెల్లించే సొమ్ముతో సకల సౌకర్యాలు పొందుతారని చెప్పారు. అదేసమయంలో భారత సైన్యంపై విమర్శలు గుప్పిస్తారని తెలిపారు. ఇత‌రుల‌కంటే మేధావులు, సెక్యుల‌రిస్టుల నుంచి మ‌న దేశానికి పెద్ద ప్ర‌మాద‌ముందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఉత్తర భారతంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇటీవలి కాలంలో నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న విషయం తెల్సిందే. ఇపుడు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వారి మార్గాన్నే అనుసరిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా కోసం బలిదానం... మదనపల్లె యువకుడి ఆత్మహత్య