Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్

Work From Home
, బుధవారం, 20 జులై 2022 (21:24 IST)
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో వర్క్‌ ఫ్రం హోంపై కొత్త నిబంధనలను మంగళవారం ప్రకటించింది కేంద్ర వాణిజ్య శాఖ. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ యూనిట్‌లో గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్‌ ఫ్రం హోం కల్పించేందుకు వీలు కల్పించింది. అలాగే గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగుల వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
 
వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించేందుకు 'స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ 2006'లోకి కొత్త నిబంధన 43ఏను తీసుకొచ్చింది కేంద్రం. ఉద్యోగుల నుంచి వస్తున్న వినతుల మేరకు సెజ్‌ల కోసం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ వెల్లడించింది.  
 
ఫలితంగా గరిష్ఠంగా ఏడాది పాటు మాత్రమే వర్క్‌ ఫ్రం హోం అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంటి నుంచే పని చేసేందుకు అవసరమైన సామగ్రి, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలను సెజ్‌ యూనిట్లు అందిస్తాయని పేర్కొంది. సంస్థ అనుమతితో ఆయా సామగ్రిని ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్రో రైల్వే స్టేషన్ వద్ద స్టెప్పులేసిన అమ్మాయి... చివరికి ఏమైందంటే?- video