Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

Advertiesment
Woman

ఠాగూర్

, మంగళవారం, 22 జులై 2025 (08:59 IST)
పాతికేళ్ల క్రితం వివాహం చేసుకుని, భర్త, నలుగురు పిల్లలతో సంసార జీవితాన్ని సాగిస్తూ వచ్చిన ఓ మహిళ.. పాతికేళ్ల వయస్సున్న మేనల్లుడుతో ప్రేమలో పడింది. అతని మాయలో లీనమైపోయిన ఆ మహిళ... అతనికి దూరంగా ఉండలేక అతనితో కలిసి పారిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని సిద్ధార్ద నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ పోషణ కోసం నెలలో చాలా రోజులు ఇంటికి దూరంగా ఉంటుంటే.. ఆ ఇంటికి ఆమె మేనల్లుడు (25) తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ ఇల్లాలికి, ఆ యువకుడి మధ్య చనువు పెరిగి.. అది ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. గత ఏడాది ఆమె, తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. దీనిపై ఆ భర్త, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కొన్నాళ్లకు ఆ యువకుడితో గొడవలు తలెత్తడంతో ఆమె తిరిగి తన భర్త దగ్గరకు వచ్చేసింది. ఆమెను పెద్ద మనసుతో భర్త క్షమించేసి అక్కున చేర్చుకున్నాడు. ఆటు.. ఆమె ప్రియుడు కూడా ఇక ఎంతమాత్రం కలిసి ఉండే ప్రసక్తే లేదని పోలీసుల సాక్షిగా చెప్పాడు. అయితే కొన్నాళ్లకు.. ఆమె మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడి చెంతకు చేరింది. ఆదివారం అతడిని వెంటబెట్టుకొని ఊరొచ్చేసింది. బంధువులు, గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. 
 
తనకు భర్త వద్దని, ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు పెద్దల ఎదుట ఆమె స్పష్టం చేసింది. 'నాతో కలిసి ఉండటానికి ఆమెకు ఇష్టంలేక పోతే.. ఆమెను నిరోధించే హక్కు నాకెక్కడిది?' అని చెబుతూ ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు భర్త అనుమతినిచ్చాడు. కాగా, ఆ మహిళకు ఉన్న నలుగురు పిల్లల్లో పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి కుమార్తె వయసు 22 యేళ్లు కాగా, రెండో కుమార్తె వయసు 18 యేళ్లు. అలాగే, ఇద్దరు కుమారుల్లో ఒకరి వయసు 17 యేళ్ళు, మరొకరి వయసు 10 యేళ్ళు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో ఫ్యూచర్ ఫార్వర్డ్ బిజినెస్ ఎక్స్‌పీరియెన్స్ స్టూడియోను ప్రారంభించిన సామ్‌సంగ్