Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యంత ప్రజాదారణ కలిగిన నేతల జాబితాలో ప్రధాని మోడీకి అగ్రస్థానం

అత్యంత ప్రజాదారణ కలిగిన నేతల జాబితాలో ప్రధాని మోడీకి అగ్రస్థానం
, ఆదివారం, 7 నవంబరు 2021 (14:55 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ కలిగిన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందడమే కాకుండా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 
 
గత 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల నేతల్లో మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.
 
సంపన్నదేశాల అధ్యక్షులు కూడా ప్రధాని మోడీ దరిదాపుల్లో లేరు. అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. 
 
ఈ విషయాన్ని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్​ ఈ వివరాలను ట్విట్టర్​లో షేర్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తోంది. 
 
గతేడాది కూడా మోడీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వేలో భారత్​లో 2,126 మందిని ఆన్​లైన్ ఇంటర్వ్యూ చేసింది మార్నింగ్ కన్సల్ట్​. ఈ సర్వే ప్రకారం, ఈ ఏడాది మోడీ 70 శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు.
 
మెక్సికో అధ్యక్షుడు లోపెజ్​ ఒబ్రేడర్ 66 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ టాప్​ 10లో చివరిస్థానంలో నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్థాయిలో టమోటా ధర