Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూల‌న‌... గిరిజ‌నుల్లో ప‌రివ‌ర్త‌న

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూల‌న‌... గిరిజ‌నుల్లో ప‌రివ‌ర్త‌న
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (11:01 IST)
పరివర్తన కార్యక్రమం ద్వారా విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీసు, ఎస్.ఈ.బి, ఐటిడిఏ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసులు ప్ర‌త్యేక దాడులు చేస్తున్నారు.  జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ, రాచవీధి గ్రామాల్లో 7 బృందాల‌తో 14 కటింగ్ మెషిన్ లు,  100 మంది సిబ్బందితో కలసి సుమారు 85 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసి కాల్చివేశారు.
 
 
ప్ర‌తిసారి గంజాయి నిర్మూల‌ను అడ్డుప‌డే గ్రామ‌స్తులు, గిరిజ‌నులు ఈసారి ఎటువంటి ప్రతిఘటనకు దిగ‌లేదు. గంజాయి మహమ్మారి వలన జరిగే నష్ఠాలు, కష్ఠాల‌ను అవగాహన చేసుకొని గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి పంటను నిర్మూలించడానికి సహకరిస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇటీవ‌ల గంజాయి, మాద‌క ద్ర‌వ్యాల రవాణాపై సాగిన చ‌ర్చ‌, ర‌చ్చ‌ల‌పై గ్రామ‌స్తుల‌కు అధికారులు వివ‌రించారు. గంజాయి వ‌ల్ల యువ‌త నిర్వీర్యం కావడ‌మే కాకుండా, దేశ ప్ర‌గ‌తికి ఇది వినాశ‌న‌మ‌ని తెలిపారు. ఈ మాద‌క ద్ర‌వ్యాల వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌, స‌మ‌గ్ర‌త‌కు కూడా భంగం క‌లుగుతుంద‌ని పోలీసులు గ్రామ‌స్తుల‌కు ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మంలో వివ‌రిస్తున్నారు. 


ఈ కార్యక్రమంలో  జెడి ఎస్.ఈ. బి. నరేందర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వివేక్, ఎస్.ఈ.బి. ఇన్స్పెక్టర్ కేశవరావు, స్థానిక జి.మాడుగుల ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , ఎస్సై శ్రీనివాస్ ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతోషంగా దీపావ‌ళి చేసుకుని... కూలి పనికెళ్తుంటే...