Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Advertiesment
UP man

సెల్వి

, బుధవారం, 20 ఆగస్టు 2025 (21:53 IST)
UP man
ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో కానీ.. ప్రియుడితో సన్నిహితంగా వున్న భార్యకు భర్తే పెళ్లి చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భార్య తన ప్రియుడితో కలిసి భర్త కంటికి చిక్కింది. దీంతో ఆ భర్త ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దగ్గరుండి ప్రియుడితో భార్యకు పెళ్లి జరిపించాడు. 
 
వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్‌ జిల్లాని అర్వింద్ పటేల్ అనే వ్యక్తి.. చందౌలి జిల్లా హమీద్‌పూర్‌కు చెందిన రీనా అనే మహిళను 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు సియారామ్‌ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయమే క్రమంగా వివాహేతర సంబంధం వరకు దారి తీసింది. దాదాపు 20 ఏళ్లుగా వీళ్ల మధ్య వివాహేతర సంబంధం అలా సాగుతూనే వస్తోంది. 
 
అర్వింద్‌ పటేల్‌కు వాళ్లపై అనుమానం రావడంతో పలుసార్లు పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈసారి రెడ్‌ హ్యాండెడ్‌గా వాళ్లిద్దరూ దొరికిపోయారు. ఈ ఘటనపై అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సియారామ్, అలాగే తన భార్య కుటుంబీకులకు కూడా ఈ విషయం చెప్పాడు. 
 
ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడాడు. చివరికి వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే వారణాసిలోని ఓ గుడిలో వాళ్లకు పెళ్లి జరిపించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!