Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సలసల కాలే నీటిలో చెయ్యి పెట్టిన చిన్నారి... తర్వాత ఏం జరిగిందంటే?

సలసల కాలే నీటిలో చెయ్యి పెట్టిన చిన్నారి... తర్వాత ఏం జరిగిందంటే?
, బుధవారం, 15 డిశెంబరు 2021 (13:35 IST)
సలసల కాలే నీరు శరీరంపై పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. ఈ విషాధ ఘటన మంగళవారం జరిగింది.  వివరాల్లోకి వెళితే.. దాసనకొప్పలులో నివాసం ఉంటున్న రాము ఫొటోగ్రాఫర్‌ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కుమార్తె ఉంది.
 
మంగళవారం చిన్నారికి స్నానం చేయించేందుకు తల్లి తన కుమార్తెను బాత్‌రూమ్‌కు తీసుకెళ్లింది. నీరు చాలా వేడిగా ఉండటంతో చల్లటి నీరు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలో చిన్నారి బక్కెట్‌లోకి చేయి పెట్టింది. అంతే వేడీ నీట్లో వేడి తాళలేక బయటికి తీసేసింది. 
 
ఈ క్రమంలో బకెట్‌ ఒకపక్కకు ఒరిగి నీరంతా మీదపడి శరీరం బొబ్బలు ఎక్కింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళ్లెదుటే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం, గ‌వ‌ర్న‌ర్ల‌ను క‌లిసిన నేవీ వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా