Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలుడిని రక్షించబోయి 30 మంది బావిలో పడ్డారు

బాలుడిని రక్షించబోయి 30 మంది బావిలో పడ్డారు
, శుక్రవారం, 16 జులై 2021 (10:05 IST)
మధ్యప్రదేశ్‌లో గంజ్‌బసోడ గ్రామంలో బావిలో పడిన బాలుడిని రక్షించబోయి 30 మంది బావిలోపడ్డారు. ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన జిల్లా ప్రధాన కార్యాలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజ్‌ బసోడ వద్ద జరిగింది.

గంజ్‌బసోడ గ్రామం బావిలో బాలుడు పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు వెళ్లిన దాదాపు 30 మంది బావి పైకప్పు గోడ కూలిపోవడంతో బావిలో పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. బావిలో పడిన వారిలో 20 మందిని రక్షించగా, 10 మంది లోపల చిక్కుకున్నారు. బాలుడిని రక్షించిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వారిని స్థానిక ఆస్పత్రికి అధికారులు తరలించారు. అటు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటన స్థలంలోనే ఉండి సహయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సిఎం ఆదేశాలతో మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ను ఘటనస్థలికి వెళ్లారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అధికారులు మాట్లాడుతూ... బాలుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల బరువు కారణంగా బావి పైకప్పు కూలిపోయిందని తెలిపారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ... ఘటనపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

బావిలోపడ్డవారిని బయటికి తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బఅందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు కొంతమందిని రెస్క్యూ చేశాయి. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో తగ్గిన కరోనా మరణాలు