Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డొమినోస్ పిజ్జా ఉద్యోగి మృతి.. కారణం ఏంటంటే?

suicide

సెల్వి

, గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:00 IST)
థానే నగరంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఉద్యోగి ప్రముఖ పిజ్జా చైన్ అవుట్‌లెట్‌లో శుభ్రపరిచే పనులు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మహేశ్ అనంత్ కదమ్‌గా గుర్తించారు.
 
వర్తక్ నగర్ ప్రాంతంలోని డొమినోస్ పిజ్జా జాయింట్‌లో ఈ సంఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి ధృవీకరించారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షాక్‌కు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా, ఇటీవల సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో ఇద్దరు టీనేజ్ సోదరులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన జరిగింది. శివం యాదవ్ (13), శివ యాదవ్ (15) జనవరి 16న తమ పాఠశాల టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో డీఎస్సీ పోస్టులు... దివ్యాంగులకు 54 యేళ్ళ వరకు అవకాశం...