Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్యలో శ్రీలంక తరహా పేలుళ్లకు లష్కరే-తోయిబా కుట్ర.. భద్రత కట్టుదిట్టం..

అయోధ్యలో శ్రీలంక తరహా పేలుళ్లకు లష్కరే-తోయిబా కుట్ర.. భద్రత కట్టుదిట్టం..
, శనివారం, 15 జూన్ 2019 (16:35 IST)
శ్రీలంకలో ఏప్రిల్‌లో తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈస్టర్ పండుగ రోజున మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 359 మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. ఈ ఘటనను ఇంకా జనం మరిచిపోలేని పరిస్థితుల్లో వుండగా.. నిఘా సంస్థలు మరో హెచ్చరికను జారీ చేశాయి. 
 
శ్రీలంక పేలుళ్లకు సంబంధించి 106 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద జరిపిన విచారణలో అయోధ్యను లక్ష్యంగా దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేందుకు ఆదివారం వెళ్లనున్నారు. 
 
అలాగే యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ కూడా రామాలయంలో ఆదివారం పూజలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా రామ జన్మభూమి అధ్యక్షుడు మహానంద్ 81వ జయంతి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్యలో ఉగ్రవాదులు దాడికి కుట్రపన్నినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 
 
అయోధ్యలో బస్సులు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలును లక్ష్యంగా లష్కరే తోయిబా సంస్థ దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన తర్వాత ప్రేమ.. నువ్వు నాకే సొంతమని కత్తితో పొడిచేశాడు..