Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగ్రా హైవేపై దారుణం : ప్రముఖ వైన్ వ్యాపారి కారులో సజీవదహనం!!

Advertiesment
ఆగ్రా హైవేపై దారుణం : ప్రముఖ వైన్ వ్యాపారి కారులో సజీవదహనం!!
, గురువారం, 15 అక్టోబరు 2020 (09:19 IST)
ముంబై - ఆగ్రా హైవేపై దారుణం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సజీవదహనమయ్యారు. మృతుని పేరు సంజయ్ షిండే. ప్రముఖ వైన్ వ్యాపారి. ద్రాక్ష ఎగుమతిదారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్సీపీ కీలక నేత. ఆయననను తన సొంత కారులోనే కాలిబూడిదయ్యారు. ద్రాక్ష తోటల కోసం పురుగు మందులను కొనుగోలు చేసేందుకు పింపాల్ గావ్‌కు ఆయన తన కారులో వెళుతున్న వేళ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ముంబై, ఆగ్రా హైవేపై బస్వంత్ టోల్ ప్లాజా సమీపంలో కారులో షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిపారు. కారులో శానిటైజర్‌లు ఉండటంతో, మంటలు మరింతగా చెలరేగాయని, ఇదేసమయంలో సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ జామ్ కావడంతో, డోర్లు తీసుకుని ఆయన బయటకు రాలేకపోయారని తెలిపారు. 
 
కారు తగులబడి పోవడాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ వచ్చి, మంటలను ఆర్పిందని, ఆ తర్వాతే కారులో ఉన్నది సంజయ్ షిండే అని తెలిసిందని అన్నారు. కాగా, నాసిక్ ప్రాంతంలో సంజయ్ ఎంతో పేరున్న వ్యక్తి. అటు వ్యాపారంలో, ఇటు రాజకీయాల్లోనూ రాణించారు. సంజయ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారటోరియంపై సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది: కేంద్రంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు