Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీ... భారత ఆత్మ... దేశం నుంచి వేరుచేయలేరు : మన్మోహన్ సింగ్

Advertiesment
Manmohan Singh
, శనివారం, 7 మే 2016 (10:52 IST)
కాంగ్రెస్ పార్టీ భారత ఆత్మ అని.. దాన్ని దేశం నుంచి వేరుచేయలేరని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. సేవ్ డెమొక్రసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 'బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెబుతున్నారు. దేశానికి కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నేను ఒకటే చెబుతున్నా. 
 
కాంగ్రెస్ అనేది భారత ఆత్మ.. దాన్ని భారత్ నుంచి వేరు చేయడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేనా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా సునిశిత విమర్శలు సందిస్తూనే, కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతుకాక తప్పదన్న బీజేపీ విమర్శలపై మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్ ఎన్‌కౌంటర్ : ముగ్గురు మిలిటెంట్ల హతం