Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో దారుణం.. డ్రైనేజీలో నగ్నంగా వేశ్య శవం.. జననాంగాల వద్ద..?

ముంబైలో దారుణం.. డ్రైనేజీలో నగ్నంగా వేశ్య శవం.. జననాంగాల వద్ద..?
, బుధవారం, 12 మే 2021 (19:45 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం జరిగింది. డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. ఒంటిపై దుస్తులు లేవు. జననాంగాల వద్ద గాయాలు కనిపించాయి. ఆమెను రేప్ చేసి.. గొంతుకోసి.. చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. 
 
ఎంతో బిజీగా ఉండే ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ధనవంతులు ఎక్కుగా నివసించే బాంద్రా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు.
 
వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గొంతుకోసి ఆమెను చంపేశారు. జననాంగాలపై తీవ్రంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
సెక్షన్‌ 376, 302 కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన మహిళ వేశ్యగా ప్రాథమికంగా భావిస్తున్నారు. నగదకు సంబంధించి గొడవ జరిగి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వెళ్లిన విటులు, చంపేసి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిపారు. నిందితులు దొరికిన తర్వాత ఈ హత్య కేసుపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడు ఓ బాటిల్‌ దూరంలో!