Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెక్‌డొనాల్డ్స్ రమ్మన్నాడు.. ఇంటికి తీసుకెళ్లి మత్తుమందిచ్చి రేప్ చేశాడు..

వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలికలపై లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను అపహరించిన కొరియోగ్రాఫర్, 17 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై

Advertiesment
Mumbai
, బుధవారం, 20 జూన్ 2018 (12:24 IST)
వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలికలపై లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను అపహరించిన కొరియోగ్రాఫర్, 17 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళ్తే కొరియోగ్రాఫర్, ఓ టీవీ రియాల్టీ షో కంటెస్టెంట్ అయిన ఆదిత్య గుప్తా (20)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 ఏళ్ల కాలేజీ విద్యార్థిని పరిచయం అయింది. ఈ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలో 17ఏళ్ల బాలికను లొంగదీసుకున్న ఆదిత్యా గుప్తా.. ఆమెను కిడ్నాప్ చేశాడు. మత్తు మందు ఇచ్చి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. 
 
పోలీసుల వెల్లడించిన వివరాల్లోకెళితే.. గత ఆదివారం బాధితురాలిని మెక్ డొనాల్డ్స్‌కు రావాలని ఆదిత్య పిలిచాడు. స్నేహితుడనే చనువుతో ఆమె కూడా ఆదిత్య చెప్పినచోటుకు వచ్చింది. అక్కడి నుంచి నలసోపారాలోని నివాసానికి తీసుకెళ్లాడు. ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆపై రేప్ చేశాడు.

అనంతరం లోకల్ ట్రైన్‌లో అంధేరికి తీసుకొచ్చి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అత్యాచారానికి పాల్పడ్డ ఆదిత్యను అరెస్ట్ చేసి, పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో వలసదారులు.. 52 మంది భారతీయులే.. పిల్లల పరిస్థితి దారుణం..