Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ యేడాదిగా వేర్వేరుగా ఉంటున్నారా.. అయితే విడాకులు ఇవ్వొచ్చు : మద్రాస్ హైకోర్టు

భార్యాభర్తలు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా నివశిస్తుంటే.. వారికి తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు కీలక తీర్పును వెలువరించారు.

Advertiesment
ఓ యేడాదిగా వేర్వేరుగా ఉంటున్నారా.. అయితే విడాకులు ఇవ్వొచ్చు : మద్రాస్ హైకోర్టు
, గురువారం, 11 ఆగస్టు 2016 (11:31 IST)
భార్యాభర్తలు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా నివశిస్తుంటే.. వారికి తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు కీలక తీర్పును వెలువరించారు. 
 
తమిళనాడులోని ఓ యువతీయువకుడు 2013 మేలో పెళ్లి చేసుకున్నారు. కానీ... 2014 జూలై నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపడంతో 2015లో ఇద్దరూ కలిసి విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను తిరునల్వేలి ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. విడాకులు పొందడానికి సరైన కారణాలను చూపలేదంటూ కోర్టు వారి పిటీషన్‌ను తోసిపుచ్చింది. 
 
దీంతో వారిద్దరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని అనుకుంటే.. కోర్టు అందుకు కారణాలను వెతకాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక కోర్టు నిజనిర్ధారణ కోసం పట్టుబట్టనక్కర్లేదని జస్టిస్ కేకే శశిధరన్, జస్టిస్ ఎన్.గోకుల్‌దాస్‌లతో కూడిన డివిజన్ బెంచి తెలిపింది. 
 
ముఖ్యంగా.. విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి యేడాది ముందు నుంచి వాళ్లు విడిగానే ఉంటున్నారు కాబట్టి ఇక వారు కలిసి జీవించే అవకాశం లేదని, ఇక వాళ్లకు విడాకులు మంజూరు చేయడం తప్ప కోర్టుకు కూడా వేరే అవకాశం లేదని న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు పోతున్నా.. మొబైల్ ఫోన్ దోచుకుని పారిపోయాడు