Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు పోతున్నా.. మొబైల్ ఫోన్ దోచుకుని పారిపోయాడు

సమాజంలో నైతిక విలువలు, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా పోతోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం కారుతున్న ఓ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్ద

Advertiesment
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు పోతున్నా.. మొబైల్ ఫోన్ దోచుకుని పారిపోయాడు
, గురువారం, 11 ఆగస్టు 2016 (11:13 IST)
సమాజంలో నైతిక విలువలు, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా పోతోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం కారుతున్న ఓ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్దామనో లేక, అంబులెన్స్‌కు ఫోన్ చేద్దామన్న కనీస ఆలోచన చేయకపోగా ఏకంగా గాయపడ్డ వ్యక్తిని దోచుకున్నాడో ప్రబుద్ధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ సుభాష్‌నగర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన మతిబూల్ అనే రిక్షా కార్మికుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన తీవ్రగాయాలకు గురై రక్తమోడుతూ రోడ్డుపై అలాగే పడిపోయాడు. అయితే... ఆ సమయంలో అతన్ని రక్షించేందుకు ఎవరూ రాలేదు. అనంతరం అటువైపుగా వెళ్తున్న మరో రిక్షా కార్మికుడు గాయపడ్డ వ్యక్తిని చూసి కనీసం తన తోటి రిక్షా కార్మికుడని కూడా చూడకుండా అతని మోబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు.
 
కాగా... తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, పోలీసులకు 7 గంటలకు విషయం తెలిసి వారు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే రక్తం అధిక మోతాదులో పోవడంతో అతను మృతిచెందాడు. తాదా. ఆ టెంపో డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే కిందకు దిగి చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజి ద్వారా తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయీమ్ వెంటే ఓ బండి నిండా అందమైన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా?