Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోధుమలంటే అలర్జీ.. రొట్టెలు తింటే తలనొప్పి... యువతి సూసైడ్

Advertiesment
Wheat allergy
, బుధవారం, 19 డిశెంబరు 2018 (14:58 IST)
ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహార ధాన్యం గోధుమలు. గోధుమ పిండితో చేసిన వంటకాలే ఇక్కడ ప్రధాన ఆధారం. అదే దక్షిణ భారతదేశంలో అయితే, వరి ధాన్యంతో చేసిన ఆహారం కీలకం. కానీ, ఉత్తరాదికి చెందిన ఓ యువతికి గోధుమలు చూస్తేనే అలర్జీని. వాటిని చూసి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రంలోని జీంద్ ప్రాంతానికి చెందిన సురభి (25) అనే యువతికి ఇంకా పెళ్లి కాలేదు. ఈమెకు చిన్నప్పటి నుంచి గోధుమలంటే అలర్జీ. వాటిని చూస్తేనే తట్టుకోలేకపోయేది. పైగా, గోధుమలతో చేసిన ఏ ఆహారాన్నీ ఆమె ముట్టేది కాదు. 
 
బీటెక్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే ఆమెకు వైద్యం చేయించాలని తల్లిదండ్రులు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో ఆమె క్రమంగా తన బరువును కోల్పోయింది. 52 కిలోల బరువుండే ఆమె 32 కిలోల బరువుకు తగ్గిపోయింది. 
 
రొట్టెలు తింటే తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతుండే ఆమె, దాన్ని మానేసి, బియ్యం, పల్లీలపై ఆధారపడినా బరువులో మార్పులేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమె తన చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య