Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరికృష్ణ - లక్ష్మీ పార్వతి పార్టీలకు ఈసీ ఝులక్.. పార్టీల గుర్తింపు రద్దు

దేశంలో గుర్తింపు లేదని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝులక్ ఇచ్చింది. గత 2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 255 పార్టీల గుర్తింపు ర

Advertiesment
హరికృష్ణ - లక్ష్మీ పార్వతి పార్టీలకు ఈసీ ఝులక్.. పార్టీల గుర్తింపు రద్దు
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (14:29 IST)
దేశంలో గుర్తింపు లేదని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝులక్ ఇచ్చింది. గత 2005 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 255 పార్టీల గుర్తింపు రద్దు అయింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో రద్దు అయిన పార్టీల వివరాలను పరిశీలిస్తే.. 
 
ఈసీ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల్లోని 12 పార్టీలు ఇవే..
1. ఆల్ ఇండియా సద్గుణ పార్టీ
2. ఆంధ్రనాడు పార్టీ
3. అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ)
4. బహుజన రిపబ్లికన్ పార్టీ
5. భారతీయ సేవాదళ్
6. జై తెలంగాణ పార్టీ
7. ముదిరాజ్ రాష్ట్రీయ సమితి
8. నేషనల్ సిటిజన్స్ పార్టీ
9. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి)
10. సత్యయుగ్ పార్టీ
11. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
12. తెలంగాణ ప్రజా పార్టీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్కీ సైనికులను సజీవ దహనం చేసిన ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు.. వీడియో కలకలం